Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళను ఎవరు ఎన్ని రకాలుగా నిర్వచించుకున్నా, కవిత్వమూ ఒక కళే. దశ్య రూపమైనా, అక్షర రూపమైనా, నాదరూపమైనా కళాత్మకంగా వ్యక్తీకరింపబడినది ప్రేక్షకులనైనా, శ్రోతలనైనా ఆకర్షించలేదు. వ్యక్తీకరణా నిపుణత లేని వారెవరూ గొప్ప కళాకారులు కాలేరు.
కళామాధ్యమాన్ని అనుసరించి వ్యక్తీకరణ నైపుణ్యాలు మారుతుంటాయి. కవిత్వాన్నే తీసుకుంటే, కవికి ఊహాశాలిత ఎంత అవసరమో, భాషాప్రయోగ నిపుణత కూడ అంతే అవసరం. విశిష్ట అభివ్యక్తిని పరిపుష్టం చేయడంలో భాషా ప్రయోగనిపుణత కూడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్దిష్టమైన ప్రత్యేక ప్రయోజనాలను ఆశించిన వ్యక్తీకరణనే ''అభివ్యక్తి'' అని అంటున్నాను. భాషాప్రయోగ నిపుణతను వాక్యప్రయోగ నిపుణత, పద సంయోజనానిపుణత అని ప్రస్తుతానికి రెండు రకాలుగా విభజించుకుందాం. కవిత్వంలో పద సంయోజనా నిపుణతనే, ఇక్కడ నేను సార్థక పదప్రయోగం అంటున్నాను. దీనినే ప్రాచీన కావ్య వ్యాఖ్యాన పరిభాషలో ''దళ సార్థక్యం'' అనే వారు. పర్యాయ పద అసహిష్ణుతను, పద సంయోజనా నిపుణతకు ప్రధాన నిదర్శనంగా భావించవచ్చు.
పద, పదబంధ సంయోజనలో సార్థకతను నిరూపించే అంశాలు అనేకం. సందర్భానికి వన్నె పెట్టే అర్థాంతరస్ఫూర్తిని కలిగించే పదసంయోజన వాటిలో ప్రధానమైనది. అర్థాంతర స్ఫూర్తి కొన్ని సందర్భాలలో ''వ్యంగ్యం'' కావచ్చు, మరికొన్ని సందర్భాలలో ''ధ్వని'' కావచ్చు. నాదసామ్యం కలిగిన పదాల, పదబంధాల కూర్పుతో, వాక్యాలలో ఒక అంతర్లయను సాధించడం కూడ సార్థక పదసంయోజనా శిల్పమే.
''తను శవమై.../ ఒకడికి వశమై.../ తనువు పుండై/ ఒకరికి పండై / ఎప్పుడూ ఎడారై.../ ఎందరికో ఒయాసిస్సై...!'' -అలిశెట్టి ప్రభాకర్ గారి ఈ మినీకవితలో శవమై, వశమై అనే పదాలలో వర్ణవ్యత్యస్తత వలన భావభిన్నత్వం సమకూరింది. శవమై, వశమై, పుండై, పండై అనే పదాలలో ఏ పదమూ పర్యాయపదాన్ని సహించదు. ఏ పదాన్ని మార్చినా నాదసామ్యం వలన చేకూరిన భావగాఢత చెదిరిపోతుంది. ఒయాసిస్సుకు బదులుగా మరే తెలుగు పదాన్ని ఉపయోగించినా ఆ క్లుప్తత, భావగాంభీర్యం ఉండదు. ఒకడికి, ఒకరికి అనే పదాలు 'ఎందరికో' అనే భావాన్ని సార్థకం చేస్తున్నాయి.
''వేశ్య'' అనే ఈ కవితాశీర్షిక తెలియకపోతే, ఈ కవిత ఉద్దేశమే బోధపడదు. అంటే, ఇక్కడ శీర్షిక కూడ కవితలోని ముఖ్యభాగమే కదా! శవం, వశం, పుండు, పండు, ఎడారి, ఒయాసిస్సు అనే జంట ప్రయోగాలలోని భేదకతాలక్షణం (Contrastవల్ల, ఆమె అనుభ వించే నరకం, ఇతరులు అనుభవించే ఆనందం బలంగా వ్యక్తమై నాయి. మొదటి రెండు భావాంశాలకు, మూడవ భావాంశం, సారాంశంగా, సూత్రీకరణగా అమరడం వలన కూడ ఈ కవిత శక్తిమంతమైంది. శబ్దాల ద్వారా దశ్యాలను సాక్షాత్క రింపజేయడం కూడ, ఈ కవిత పాఠకుల మనస్సుల మీద చెరగని ముద్ర వేయడానికి ప్రధాన కారణం. »»The poem must be worked to the absolute limit of expressivenessµµ అనే మయకోవస్కీ మాటలు ఈ కవితకు ఎంత బాగా వర్తిస్తాయో గమనించవచ్చు.
కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడి సంపాదన సరిపోక, అధిక సంపాదన కోసం దూరదేశాలకు వెళ్లి, ఏ రెండు మూడేళ్ళకో ఒకసారి తిరిగి ఇంటికి వచ్చే భర్తకోసం ''దిగులు గూట్లో ఒంటరి పక్షి'' లాగా నిరీక్షించే భార్య దుఃఖాన్ని వర్ణిస్తూ ''దూస్రా ఆస్మాఉ'' అనే కవిత రాశారు షాజహానా (''నఖాబ్'', పుట. 48). ''ఏ రెండు మూడేళ్ళకో/ నువ్వొస్తున్న కబురు/ రోహిణి తర్వాత భూమి, ఆకాశం వైపు చూసే చూపు నాది/ నీ ఎన్ని రాకలకు చల్లబడ తానో?'' అనేది ఆ దీనురాలి స్వగతం. భూమితో పోలికలో సహన శీలత ఇమిడి ఉంది. 'రోహిణి తర్వాత' అనే మాటలు, వర్షాకాలాన్ని వ్యంగ్యం చేస్తాయి. రెండు మూడేళ్ళకు ఒకసారి వచ్చి, కొద్ది రోజులు మాత్రమే ఉండి, వచ్చినంత వేగంగానే భర్త వెళ్లిపోవడం వల్ల తన 'దేహ మనః తపనలు' తీరని స్థితిని, 'నీ ఎన్ని రాకలకు చల్లబడతాలో?' అనే వాక్యం చెబుతుంది.
''దేహ మనఃతపనల వెనుక/ మళ్ళీ వెళ్లిపోతావనే ఒక దుఃఖపు సుడి!/ ప్రతిసారీ ఆకాశాన్ని చీల్చుతూ పైకెగిరే నువ్వు/ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు/ కిటికీకివతల శూన్యం నింపుకున్న రెండో ఆకాశం!'' అనేవి ఈ కవితలోని ముగింపు వాక్యాలు. రోహిణి తర్వాత భూమికి, ఆకాశం వైపు చూడటానికి, దేహ మనః తపనలలోని తపనకు అర్థవంతమైన అన్వయమున్నది. పై వాక్యాలలో దేనికీ వాచ్యార్థం పొసగదు. 'ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరడం' అనే క్రియలు, విమానప్రయాణానికి సూచనలు. ఇంటికి మాత్రమే పరిమితమైన భార్య స్థితికి సంకేతం 'కిటికీకివతల'. ఆకాశమంటేనే శూన్యం. కానీ, 'శూన్యత నింపుకున్న ఆకాశం' మరింత స్పష్టత, గాఢతల కోసమే. భార్యాపిల్లలతో, కుటుంబంతో అనివార్యమైన ఎడబాటును అనుభవిస్తూ, వేదనను బలవంతంగా అణచుకుంటూ, దూరదేశంలో నివసించే భర్త కూడ (శూన్యం నింపుకున్న మొదటి) ఆకాశమేననీ చెబుతాయి 'రెండో ఆకాశం' అనే మాటలు. 'ఆకాశాన్ని చీల్చుతూ', 'రెండో ఆకాశం' అనే వాక్యాలలోని 'ఆకాశం' వాచ్యార్థంలోనూ, 'ఆకాశంలో సగం' అనే ప్రతీకగానూ సార్థకం కావడం వలన భావసాంద్రత సమకూరింది.
ఇక్కడ తాను, పరదేశంలో భర్త నివసిస్తున్న సందర్భంలో 'రెండో ఆకాశం' అనే మాటలు రెండు దేశాలకూ వర్తిస్తాయి. ''దూస్రా ఆస్మాఉ'' అనే శీర్షికను, 'రెండో గగనం' అనో, 'రెండో నింగి' అనో అనువదిస్తే, 'ఆకాశంలో సగం' అనే ఆధునిక నుడి కారం స్ఫురించదు. వివిధ పర్యాయపదాల మధ్య భావచ్చాయలలో ఉండే సున్నిత భేదాలను గమనించ గలగడం కవి ప్రయోగ నిపుణతకు నిదర్శనం. కాలక్రమంలో కొన్ని పదాలకు ప్రతీకాత్మకత సమకూరడాన్ని గమనించి సందర్భోచితంగా ఉపయోగిస్తే, ఆ కవిత ఆలోచనాత్మకమవుతుంది.
''హదయానికి బహువచనం'' అనే కొండేపూడి నిర్మల గారి కవితాశీర్షికను గమనించండి. స్త్రీ, యౌవనంలో అడుగిడే దశ నుంచి వద్ధాప్యం వరకు, వక్షోజాల స్వరూప స్వభావాలు, పరిణామాలు, ప్రయోజనాలు, ఇబ్బందులూ అర్థవంతంగా వర్ణింపబడిన కవిత ఇది. ఈ శీర్షికలోని 'హదయం' అనే పదానికి బదులుగా, మనసు, ఎడద, చిత్తం, ఛాతి, స్తనం లాంటి ఏ పదాన్ని వాడినా అంతటి భావ స్ఫూర్తి కలుగదు. 'మనసు', 'హదయం' అనే రెండు పదాలను కొన్ని సందర్భాలలో సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. ఈ రెండు పదాల భావచ్చాయలలో ఉన్న సున్నితమైన అంతరం ఇక్కడ గమనించ దగినది. వక్షోజాల వల్ల వనితలలో కలిగే భౌతిక, మానసిక స్థితిగతులు సూచింపబడినాయి. విరుద్ధ భావ సమ్మేళనాన్ని సూచించడానికి ఇక్కడ 'హదయం' ఎంత సార్థకమో ఊహించుకోవచ్చు. 'హదయం' అనే పదం, స్పందనా, ప్రతిస్పందనాశీలతను స్ఫురింపజేస్తుంది. గుండె, హదయం లాంటి పదాలకు ఉన్న, సారూప్య, నైరూప్య స్థితిగతులనూ ఏక కాలంలో ప్రతిఫలిస్తుంది. నిజానికి 'హదయానికి ద్వివచనం'అంటే మరింత సార్థకంగా ఉంటుంది. కాని సంస్కతంలో తప్ప, తెలుగు లో ద్వివచనం లేకపోవడం వల్ల, కవయిత్రి 'బహువచనం'అన్నారు.
-''ఒత్తిడి గుండెలు తొలుస్తది! / ఒంటరితనం ఒంటిని తొలుస్తది!'' -నందిని సిధారెడ్డి (''ఇక్కడి చెట్ల గాలి'', పుట. 12).
-''కనుమరుగవుతుందని తెలిసీ కాలంతోనే చెలిమి చేసినట్లు, కలతపెడుతున్నా కష్టాలతోనే తలపడాలి!'' -వజ్జల శివకుమార్ (''కలలసాగు'', పుట. 14).
-''విత్తనాన్ని చీల్చుకొని వక్షాలు మొలుస్తాయి! / పెత్తనాన్ని తిప్పికొడుతూ పాటలు పుడతాయి!'' -బెల్లి యాదయ్య (''విభాజకం'', పుట. 19).
పై వాక్యాలలోని వివిధ భావాంశాల ఆదిప్రాసలను, అనుప్రాసలను గమనిస్తే, ఆయా వాక్యాల ప్రవాహ సదశ గమనంలోని రహస్యం తెలుస్తుంది. ఈ వాక్యాలన్నీ సార్వకాలీన, సార్వజనీన సత్యాలే. నిర్దిష్టతలను సాధారణీకరించి, సార్వకాలీన సత్యాలుగా నిలుపడం కూడ ఒక కవిత్వమర్మజ్ఞతే. »»A proverb is essentially a rhythmic word - portrait of a thought. Still, were the rhythm to become too complex, or the portrait to run to too many words, the force would be lost అన్నాడు John Ciardi అనే విమర్శకుడు . (See: »»How Does A Poem Mean?µµ, 1959, P. 775). పై కవితావాక్యాలను గమనిస్తే, వచన కవితలలోని కొన్ని వాక్యాలు కూడ సామెతల స్థాయిని సమకూర్చుకోవడంలో, కవుల తాత్త్వికతలతో పాటు, నాదసామ్యంతో కూడిన పదసంయోజనా నిపుణతలు కూడ బోధపడతాయి. ఇలాంటి వాక్యాలే ఉల్లేఖనీయతను సంతరించుకుంటాయి.
ధ్వని, రసం, గుణం, అలంకారం, రీతి మొదలైనవన్నీ ఔచిత్యాన్ని అనుసరించే ప్రవర్తిస్తుంటాయనే క్షేమేంద్రుని మాటలు, వచనకవిత్వానికి కూడ పాక్షికంగా అయినా వర్తిస్తాయి. వచనకవిత్వంలో కూడ అంగి, అంగాల మధ్య సుందర సమన్వ యాన్ని సమకూర్చడంలో ప్రధానపాత్ర పోషించేది ఔచిత్యమే. వచనకవిత్వంలో ఔచిత్యాన్ని, నామౌచిత్యం, ఆరంభ ఔచిత్యం, నిర్వహణ ఔచిత్యం మొదలైన విధంగా విభజించు కోవచ్చు. శైలి, ఆలంకారికతలను మరింత శక్తిమంతం చేయడంలో, పద సంయోజనా ఔచిత్యం నిర్వహించే పాత్ర కూడ పరిగణింపదగినదే.
శీర్షిక, ఎత్తుగడ, ప్రతి శబ్దం, ప్రతి వాక్యం, ప్రతి అలంకారం, ముగింపు, వక్తవ్యాంశానికి శోభను సమకూర్చే విధంగా అమరడమే, వచన కవితా ఖండిక నిర్మాణశిల్పంగా భావించవచ్చు. ఉచిత పద సంయోజనాతత్పరత ఎంత ఉన్నా, అది వస్తు, రూపాలకు వన్నె పెట్టగలిగినప్పుడే సార్థక మవుతుంది.
- పెన్నా శివరామకష్ణ, 94404 37200