Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలస్పర్శ 'ఆవిష్కరణ సభ'
పెరుమాళ్ళ ఆనంద్ కవితా సంపుటి 'కాలస్పర్శ' ఆవిష్కరణ సభ జనవరి 31 ఆదివారం ఉదయం 10:00 గంటలకు సృజన సాహితి ఆధ్వర్యంలో నల్లగొండలోని న్యూస్ స్కూల్లో డా.బెల్లి యాదయ్య అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. ఏనుగు నరసింహారెడ్డి, విశిష్ట అతిధిగా డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పుస్తకావిష్కర్తగా వేణు సంకోజు, అతిథులుగా డా. తండు కష్ణ కౌండిన్య, డేగల జనార్ధన్, ఏబూషి నరసింహ, కస్తూరి ప్రభాకర్ పాల్గొననున్నట్లు సృజన సాహితి సభ్యులు సాగర్ల సత్తయ్య, మండల స్వామి పేర్కొన్నారు.
కవితా సంపుటాలకు ఆహ్వానం
నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో కందికొండ రామస్వామి స్మారక పురస్కారం 2020 నిర్వహించనున్నారు. ఇందుకు 2020లో ముద్రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. పంపాలనుకునేవారు ఒక్కోక్కటి మూడు కాపీల చొప్పున జనవరి 31, 2021లోగా అబ్దుల్ వహీద్ ఖాన్, ఇంటి నంబర్ 15- 120/4 /1 రహత్ నాగర్ కాలనీ, నాగర్ కర్నూల్, 509209 తెలంగాణ చిరునామాకు పంపవచ్చు. గెలుపొందిన సంపుటికి వేదిక తరుపున రూ.10,000/- నగదు బహుమతి అందిస్తారు. వివరాలకు 9441946909, 9492765358 నెంబర్లలలో సంప్రదించ వచ్చునని నిర్వాహకులు వనపట్ల సుబ్బయ్య, వహీద్ ఖాన్లు పేర్కొన్నారు.
'అచ్చు' ఆవిష్కరణ సభ
ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు డా.సిద్ధెంకి యాదగిరి మూడవ కవితా సంపుటి 'అచ్చు' పుస్తకం మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు సిద్ధిపేట ప్రెస్క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కె.రంగాచారి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి డా.నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, కూర రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్సీ మాణిక్యరెడ్డి, తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య మొదలగు వారు పాల్గొననున్నారు.