Authorization
Mon Jan 19, 2015 06:51 pm
21న కవి యాకూబ్ ఏ 60
మూల్యాంకన వ్యాసాల ఆవిష్కరణసభ
ముసాఫిర్ యాకూబ్ కవిత్వం (1983 -2021) మూల్యాంకన వ్యాసాలు ఆవిష్కరణసభ ఈ నెల 21న (ఔశీతీశ్రీస ూశీవ్తీy ణay) ఆదివారం సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో ఘంటా చక్రపాణి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి అతిథులుగా నగముని, కె.శివారెడ్డి, కె. శ్రీనివాస్, సీతారాం, ప్రసాదమూర్తి, కుప్పిలి పద్మ, రాజారాం తూముచర్ల, కటుకోజ్వల ఆనందాచారి, డా.పసునూరి రవీందర్, నస్రీన్ ఖాన్ తదితరులు రానున్నారు. అంకిత స్వీకర్తలుగా గోరటి వెంకన్న, నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ పాల్గొననున్నారు. తొలి ప్రతులను ప్రసేన్, వంశీకష్ణ, డా. పరిపూర్ణాచారి లకు అందించనున్నట్లు కవియాకూబ్ఏ60 కమిటీ ప్రకటించింది.
ఉగాది కవితలకు ఆహ్వానం
హైదరాబాద్ పాతనగర కవుల వేదిక లాల్ దర్వాజ ఆధ్వర్యంలో ప్లవ నామ ఉగాది వసంతమాసం సందర్భంగా వర్థమాన కవులు, కవయిత్రుల నుండి కవితలను ఆహ్వానిస్తున్నారు. కవితలు 25 లైన్లకు మించకుండా, ఎక్కడా ప్రచురితం కాని కవితలను హామీ పత్రంతో జత చేసి ఏప్రిల్ 10లోగా 9703542598 / 9182178653 వాట్సాప్ నెంబర్లకు పంపాలి. ఎంపిక చేసిన కవితల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.3,116/-, రూ.2,116/-, రూ.1,116/- నగదును అందిస్తారు. వీటితోపాటు మరో పది కవితలకు కన్సోలేషన్ బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు వేదిక కన్వీనర్ కె.హరనాథ్ను 9703542598 నందు సంప్రదించవచ్చు.