Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియల్లో విశేష కృషి చేసిన సాహితీవేత్తల గ్రంథాలను ఎంపిక చేసి పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ పురస్కారాలు అందజేయనుంది.
శ్రీ శివలీలా విలాసము (పద్య కవిత) - డాక్టర్ మంగళగిరి వేణుగోపాలాచార్యులు,
కొత్తపలక (వచన కవిత) - ఏనుగు నరసింహారెడ్డి
ఒక వేణువు పలికింది (గేయకవిత) - ఆదూరి సత్యవతీదేవి
వింతజలం (బాలసాహిత్యం) -నారంశెట్టి ఉమామహేశ్వరరావు
అధూరె (కథ, కథానిక సాహిత్యం) - స్కైబాబ
మరణానంతర జీవితం (నవల) - నందిగం కష్ణారావు
కథా తెలంగాణం (సాహిత్య విమర్శ) - డాక్డర్ బి.వి.ఎస్.స్వామి
వరూధిని (నాటకం) - ఎం.పురుషోత్తమాచార్య
భగవాన్బుద్ధ (అనువాదసాహిత్యం)- బొర్రాగోవర్ధన్
రియాలిటీ చెక్ (వచన రచన) - పూడూరి రాజిరెడ్డి
నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు (రచయిత్రి ఉత్తమ గ్రంథం) - శారదాశ్రీనివాసన్ లను సాహితీ పురస్కారాలకు ఎంపిక చేశారు. డిసెంబర్ 1న తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో వీరిని నగదు, పురస్కార పత్రం, శాలువాతో సత్కరిస్తారు.