Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండపల్లి నీహారిణి రచనలు 'తెలంగాణ వేగు చుక్కలు ఒద్దిరాజు సోదరులు' పరిశోధనా గ్రంథం, 'ఎనిమిదో అడుగు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతుంది. డా||కె.వి.రమణాచారి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య ఎస్.వి.సత్యనారాయణ, దేవులపల్లి ప్రభాకర్ రావు, అమ్మంగి వేణుగోపాల్, మోతుకూరు నరహరి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఒద్దిరాజు మురళీధర్రావు పాల్గొంటారు.