Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 2018 విశ్వ పుస్తక మేళాను 2019 జనవరి 6 నుండి 14 వ తేదీ వరకు న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరుగుతుంది. ఈ మేళాలో ప్రతియేడు ఒక కొత్త అంశంపై ఆంగ్లంతో పాటు అన్ని భారతీయ భాషల్లో వచ్చిన పుస్తకాల ప్రత్యేక ప్రదర్శన, రచనల కేటలాగు వుంటాయి. ఈ సంవత్సరం ప్రత్యేక అవసరాలు గల పాఠకుల కోసం ఆయా రంగాల్లో వచ్చిన పుస్తకాలు, బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో, వీడియో సామాగ్రిని ఈ మేళాలో ప్రదర్శిస్తారు. అందుకోసం సంబంధించిన వాటిని నేషనల్ బుక్ట్రస్ట్, ఇండియా, గ్రౌండ్ ఫ్లోర్, లిటరసీ హౌస్, ఆంధ్రమహిళా సభ కాలేజ్ క్యాంపస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఎన్.సి.సి.గేట్ వద్ద), హైదరాబాద్ -500007 చిరునామాకు పంపగలరు. వివరాలకు : 040-27077333