Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరసం రాష్ట్రస్థాయి కవితా,కథానికల పోటీ
తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ద్వితీయ మహాసభలు 2019 మార్చి 9, 10 తేదీలలో వరంగల్లో జరుగుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రస్థాయి కవితా, కథానికల రచనల పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో మొదటి బహుమతి రూ.3000, రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000గా, కథా రచనకు ప్రథమ బహుమతిగా రూ.5000, ద్వితీయ బహుమతిగా రూ.3000, తృతీయ బహుమతిగా రూ.2000 నగదు అందించను న్నారు. పోటీకి పంపే రచనలను డా|| రాపోలు సుదర్శన్, అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ప్లాట్ నెం.213, మల్టీనాయక్ ప్లాజా, కమాన్ టేకిడి, అబిడ్స్, హైదరాబాద్ - 500001 చిరునామాకు మార్చి 5లోగా చేరేట్టు పంపాలని, ఈ-మెయిల్ ద్వారా పంపే వారు sfc_dr@yahoo.com కు పంపాలి.
తెలంగాణ సాహిత్య సమాఖ్య పుస్తకావిష్కణ
తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో నక్క హరికృష్ణ రాసిన వ్యాస సంపుటి 'పరామర్శ' పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ నెల 27న సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరు కానున్నారు.
రామా చంద్రమౌళికి దేవులపల్లి పురస్కారం
వంశీ ఆర్డ్ థియేటర్ ఆధ్వర్యంలో ఈ నెల 26న మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో ప్రసిద్ధ కవి, రచయిత ఆచార్య రామా చంద్రమౌళికి దేవులపల్లి కృష్ణశాస్త్రి వంశీ సాహితీ పురస్కారం-2019 అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరుకానున్నారు.
'అంతరంగాలు' ఆవిష్కరణ సభ
ప్రసాద్ తుమ్మా రాసిన అంతరంగాలు కవిత్వ పుస్తకం ఆవిష్కరణ సభ హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని షోయబ్ హాల్లో మార్చి 3 ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.ఈ సభలో జూలూరి గౌరీశంకర్, కవి యాకూబ్,నారాయణ శర్మ, కోయి కోటేశ్వరరావు, కోయ చంద్రమోహన్ పాల్గొంటారు.
రాష్ట్ర స్థాయి పురస్కారాలు
జాతీయ సాహిత్య పరిషత్ 32వ వార్షికోత్సవం సందర్భంగా పుస్తక ఆవిష్కరణలు మరియు రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారాలు అందించనున్నట్టు సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. వచ్చే నెల మార్చి 3వ తేదీన సిద్దిపేటలో జరిగే సభలో శిరంశెట్టి కాంతారావు, గంగాపురం శ్రీనివాస్ పుప్పాల కృష్ణమూర్తి, సామలేటి లింగమూర్తి, రుద్రాక్షల ప్రభులింగ శాస్త్రిలకు పురస్కారాలు అందజేస్తారు.