Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలమూరు కరువు, నీటి కొరతకు సంబంధించిన ఉద్యమాలు చేయడంతో పాటు విస్తృతంగా రచనలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న వారిలో ఎం.రాఘవాచారి ముఖ్యులు. అలా కృష్ణాజలాల మీద, పున:పంపిణీ మీద, పాలమూరు రంగారెడ్డి పథకం మీద రాసిన ఎన్నో వ్యాసాలు ఇందులో వున్నాయి. నీటి పారుదల రంగానికే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల సమస్యలను విశ్లేషించే వ్యాసాలు కూడా రాయడం గమనించదగ్గ విషయం. వీటిలో భారత రాజ్యాంగాన్ని, అందులోని లౌకిక భావనను రక్షించుకోవడం, వికలాంగుల సమస్య, కార్పొరేట్ల దోపిడీ మీదా, మహబూబ్నగర్ జిల్లా విభజన మీద, నిర్వాసితుల మీద, పెద్ద కలెన్స్ మీద, మధ్య నిషేధం మీద, పాతపల్లి దళితుల మీద, రాజ్యస్వభావం మీద, కరువుమీద, తెలంగాణ అంతర్గత వైరుధ్యాల మీద వ్యాసాలున్నాయి. ఏ వ్యాసం రాసినా వాటి పూర్వాపరాలను విశ్లేషిస్తూ రాయడం, పరిష్కారాలను సూచించడం కూడా ఇందులో కనిపించడం విశేషం.
ప్రశ్నలు అలాగే వున్నాయి, రచన : ఎం.రాఘవాచారి, పేజీలు : 183, వెల : 150/-, ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు.సెల్ : 9490703857
- కె.పి