Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాలుగా తుంగభద్ర జలాల పారకం లేదు. రాయలసీమకు చెందిన ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడూ నీటి కొరత, వరుస కరువులు, వర్షాధార వ్యవసాయం. ఆశ చావదు. పొలం బీడు పెట్టుకోలేరు. బావుల స్థానంలో పోటాపోటీగా బోర్లు వేయడం, నీళ్ళు పడకపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, వున్న పొలాలు అమ్ముకోవడం, కూలినాటి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే దిశగా రైతుల జీవితాలు మారిపోయాయి. రైతు జీవితం వదిలేసుకుని బజ్జీల బండి పెట్టుకుని బతుకున్న బుద్దుడు, సేద్యం వాసనే వద్దనుకుని పట్నం వచ్చి రెక్కల కష్టం నమ్ముకునే రైతు బిడ్డ మాధవ్, రాబోయే తరానికి ఈ నరకయాతన వద్దనుకుని కూతుర్ని మోటారు మెకానిక్కుకు ఇవ్వాలనుకునే సుభద్ర, పిల్లల చదువు కోసమే పట్నం దారి పట్టి బేల్దారి పనిలో దిగిన సోమిరెడ్డి, గ్రామీణ సంప్రదాయపు కట్టుబాట్లు ఛేదించి, కులాంతర వివాహం చేసుకునే భారతి, ఎవరి పరిధిలో వాళ్ళు భవిష్యత్తు మీద ఆశను నిలుపుకుంటారు. కథలన్నింటిని ఆశావహ దృక్పథంతో ముగించడం రచయిత ప్రత్యేకత.
సీమ బొగ్గులు (కథలు), రచన : దేవిరెడ్డి వెంకటరెడ్డి, పేజీలు : 108, వెల : 60/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- రాహుల్