Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వాల్మీకి చెప్పిన రామాయణ గాథ' పుస్తకావిష్కరణ
నేడు 'వాల్మీకి చెప్పిన రామాయణ గాథ' పుస్తకావిష్కరణ సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్హాల్లో సాయంత్రం 5.30 గంటలకు జరుగుతుంది. ఈ సభలో భూపతి వెంకటేశ్వర్లు, కె.శివారెడ్డి, ఎస్.వినయకుమార్, కవి యాకూబ్, వరప్రసాద్, కోయ చంద్రమోహన్, కె.ఎల్. కాంతారావు, తంగిరాల చక్రవర్తి, అనంతోజు మోహనకృష్ణ పాల్గొంటారు. - తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం
25 న 'కలల గూడు' ఆవిష్కరణ సభ
డా|| బి. బాలకృష్ణ రచించిన కవితా సంపుటి 'కలల గూడు' ఆవిష్కరణ సభ ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. డా|| ఏనుగు నరసింహారెడ్డి, నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, సిద్ధార్థ, డా||బి.చంద్రశేఖర్ పాల్గొంటారు. - పాలపిట్ట బుక్స్
స్వాతి శ్రీపాద పుస్తకాల ఆవిష్కరణ
డా||ఎన్ గోపీ 'చైనా పోయమ్స్, లైఫ్ స్పీక్స్' రచనలను స్వాతి శ్రీపాద 'చైనా కవితలు, జీవన భాష' పేరుతో అనువాదం చేశారు. ఈ పుస్తకాల ఆవిష్కరణ ఈ నెల 25 వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ కాలేజీ క్యాంపస్లో జరుగుతుంది. మహిత సాహితి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో ఉప్పలూరి ఆత్రేయశర్మ, పత్తిపాక మోహన్, సూర్యా దనుంజరు, తమిరిశ జానకి, డా||ముక్తేవి భారతి, శిష్ల్టా మాధవి పాల్గొంటారు.
'తెలంగాణ రచయితల సంఘం ఆహ్వానం
తెలంగాణ రచయితల సంఘం ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నాలుగు సెషన్లుగా సభను జరుపుతుంది. ఇందులో గంభీరరావు పేట యాదగిరి కవితా సంపుటి 'గల్మ', బైస దేవదాసు సంపాదకత్వం వహించిన 'నీళ్ళ గోస' కవితా సంపుటి ఆవిష్కరణలు వుంటాయి. రెండవ సెషన్లో 'తెలంగాణ ఉద్యమాలు - సాహిత్య సంస్థలు, మూడవ సెషన్లో 'సామాజిక జీవితం - సాహిత్యం', అంశాలపై చర్చా కార్యక్రమం, నాలుగవ సెషన్లో పది విభాగాలుగా కవి సమ్మేళనం నిర్వహిస్తారు. డా|| నాళేశ్వరం శంకరం, డా||నందిని సిధారెడ్డి, కె.రామచంద్రమూర్తి, డా||కె.శ్రీనివాస్, డా||వి.శంకర్, డా||బన్న ఐలయ్య, డా||జె. చెన్నయ్య, డా||జి.బాలశ్రీనివాసమూర్తి, డా||దేవకీదేవి, డా||సిద్దెంకి యాదగిరి, బిల్ల మహేందర్, డా|| సూర్యా ధనుంజరు, డా||ఏనుగు నరసింహారెడ్డి, డా||తూర్పు మల్లారెడ్డి, డా||కాశీం, వి.ఆర్.విద్యార్థి, డా||ఎన్.రఘు, దాస్యం సేదాధిపతి, వఝుల శివకుమార్, కాంచనపల్లి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, అందోజు పరమాత్మ, పొన్నాల బాలయ్య, వనపట్ల సుబ్బయ్య, డా||తైదల అంజయ్య, ఎన్.జగన్రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్, డా||రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొంటారు.