Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ
తెలంగాణ చైతన్య సాహితీ ఆవిర్భావ సభ ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఏర్పాటయిన ఈ సభలో 'చినుకు సవ్వడి' కవి సమ్మేళనం, ఆశారాజు, పరమాత్మ, యాకూబ్, ఎం.నారాయణ శర్మ తదితర ప్రసిద్ధ కవులతో కవన ధార కార్యక్రమం నిర్వహిస్తారు. డా||బెల్లంకొండ సంపత్కుమార్, వఝల శివకుమార్, దేశపతి శ్రీనివాస్, అయాచితం శ్రీధర్, మామిడి హరికృష్ణ, డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పి.వేణుగోపాలస్వామి, సిహెచ్.ఉషారాణి, ఒద్దిరాజు ప్రవీణ్కుమార్ పాల్గొంటారు.
'పడగ నీడలో మన పిల్లల బాల్యం' కవితా స్పందన, చర్చ
ఈ నెల 13వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ తార్నాకలోని యాక్సిస్ బ్యాంక్ దగ్గర 'పడగ నీడలో మన పిల్లల బాల్యం' కవితా స్పందన, చర్చా కార్యక్రమం జరుగుతుంది. స్ప్రెడింగ్ లైట్, సంతకం సంయుక్తంగా నిర్వహించే ఈ సాహిత్య కార్యక్రమంలో శీలా సుభద్రాదేవి, వాహెద్, విల్సన్రావు, సమ్మెట విజయ, హిమజ, పుష్యమీ సాగర్, మంచి పుస్తకం సురేష్, భాగ్యలక్ష్మి, రేణుకా అయోల, కొండేపూడి నిర్మల, గోపాలుని లీల పాల్గొంటారు.
బొంతా లచ్చారెడ్డి రచనల ఆవిష్కరణ
బొంతా లచ్చారెడ్డి రచించిన 'సులభ వ్యాకరణం, కావ్య కుసుమాలు, బాలబోధ' పుస్తకాల ఆవిష్కరణ సభ ఆదిలాబాద్లోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుంది. సభకు డా|| ఉదారి నారాయణ, ఏనుగు నరసింహారెడ్డి, గుడిపాటి, ఎం.నారాయణశర్మ, బి.మురళీధర్, ఎస్.వి.ప్రసాద్, గుంజల భాస్కర్రెడ్డి, జానా పోశెట్టి హాజరవుతారు.
రాష్ట్రస్థాయి సినారె కవితల పోటీకి ఎంట్రీల ఆహ్వానం
డా||సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, తెలంగాణ కళావేదిక సంయుక్తంగా 'రాష్ట్రస్థాయి సినారె కవితల పోటీ' నిర్వహిస్తున్నది. సినారె వ్యక్తిత్వం, సాహిత్యం, బహుముఖ ప్రజ్ఞను ఇతివృత్తంగా చేసుకుని 25 పంక్తులు మించకుండా కవితల్ని ఆహ్వానిస్తున్నారు. కవులు జులై 20వ తేదీ లోపు డా||బుర్ర మధుసూదన్రెడ్డి, 2-10-1400, మైత్రీ టవర్స్, ఫ్లాట్ నెం.201, జ్యోతినగర్, కరీంనగర్ - 505001 చిరునామాకు పంపాలి. గెలుపొందినవారికి ఈ నెల 29వ తేదీన కరీంనగర్లో నిర్వహించే సినారె జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రదానం చేస్తారు. వివరాలకు : 9949700037