Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూర చిదంబరం రచనల ఆవిష్కరణ
కూర చిదంబరం రచించిన 'నీటి నీడ' కథా సంకలనం, 'అనుభవాలు - పాఠాలు' వ్యాస సంకలనం ఆవిష్కరణ సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో జరుగుతుంది. ఈ సభకు డా||కె.వి.రమణాచారి, బైస దేవదాసు, కళా జనార్దన మూర్తి, విహారి, పొత్తూరి సుబ్బారావు, తంగిరాల చక్రవర్తి హాజరవుతారు.
'పల్లె పడుచు' కథా సంపుటి ఆవిష్కరణ
బాలగంగాధరయ్య రచించిన 'పల్లెపడుచు' కథాసంపుటి ఆవిష్కరణ ఈ నెల 5వ తేదీ హైదరాబాద్ కళాసుబ్బారావు కళావేదికలో జరుగుతుంది. ఇందులో డా||కె.వి.రమణాచారి, డా||వోలేటి పార్వతీశం, చిల్లా రాజశేఖర్రెడ్డి, పొత్తూరి సుబ్బారావు, జె.రేణుకా ప్రభాకర్ పాల్గొంటారు. ఇదే సభలో 'డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషనల్ - 2019' అవార్డును డా|| టి.దశరథరామిరెడ్డికి, 'బాలనాగయ్య స్వారక ఉపాధ్యాయుని అవార్డు' పింగళి కమలాకేసరికి ప్రదానం చేస్తారు.
'లాంగ్మార్చ్' పుస్తక పరిచయ సభ
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన నవల 'లాంగ్ మార్చ్' పుస్తక పరిచయ సభ ఈ నెల 8 వ తేదీ ఉదయం పది గంటలకు తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సభలో అల్లం నారాయణ, గంటా చక్రపాణి, దేశపతి శ్రీనివాస్, కె. శ్రీనివాస్, కట్టా శేఖర్ రెడ్డి, టంకశాల అశోక్, మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డి, కె.పి.అశోక్ కుమార్, లక్ష్మణ్ ఏలే తదితరులు పాల్గొంటారు.
- వెంకట్ సిధారెడ్డి, 9849888773
కవితలకు ఆహ్వానం
పది పంక్తుల లోపు కలిగిన అన్ని వచన కవితా ప్రక్రియల ప్రోత్సాహంలో భాగంగా, లఘురూప కవితా వేదిక ఒక సంకలనాన్ని తీసుకురానుంది. ఇందుకోసం లఘు కవితలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆహ్వానిస్తోంది. కవితలను ఈ నెల 10వ తేదీ లోపు
nutakkir@gmail.com కి పంపాలి.
- గొల్లపెల్లి రాంకిషన్
మందరపు హైమవతికి
'సహృదయ సాహిత్య పురస్కారం'
ఒద్దిరాజుసోదరుల స్మృత్యంకంగా అందించే సహృదయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం మందరపు హైమవతి రచించిన 'నీలిగోరింట' ఎంపికైంది. ఈ నెల 15 న రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం హనుమకొండలో నిర్వహించే 23వ వార్షికోత్సవంలో రచయిత్రి పురస్కారాన్ని, నగదు బహుమతిని అందజేస్తారు.
- సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్
జాతీయ స్థాయి కవితల పోటీ
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సృజన సాహితి జాతీయస్థాయి కవితల పోటీ నిర్వహిస్తుంది. ఇందుకోసం కవితలను ఆహ్వానిస్తున్నది. వివరాలకు : శివేగారి చిన్ని కృష్ణ, 6300318230
అక్షర యోధ-2019 విజేతలు
మంచిర్యాల జిల్లా రచయితల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రంథాలయోద్యమంలో భాగంగా తొలిసారిగా నిర్వహించిన జాతీయస్థాయి అక్షర యోధ పురస్కారాల పోటీల్లో విజేతలు... మాల్యశ్రీ (మన్య భారతం), డా.ప్రభాకర్ జైని (మీల్స్ టికెట్), చలపాక ప్రకాష్ (అత్యాధునిక కవితా రూప ప్రక్రియ-నానీ) లను 2019సంవత్సరానికి అక్షర యోధలుగా ప్రకటించారు.
- బొడ్డు మహేందర్, 9963427242
అక్షరాల తోవ జాతీయస్థాయి కథల పోటీలు
అక్షరాల తోవ జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహిస్తోంది. తెలుగు నేపథ్యానికి సంబంధించిన కథలను పంపించండి. రచయితలు తమ కథలను పోస్టు, కొరియర్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు రాచమళ్ళ ఉపేందర్, అక్షరాల తోవ, కేరాఫ్. మణికంఠ ఆఫ్సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి ప్రక్కన, స్టేషన్రోడ్, ఖమ్మం - 507001 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9849277968
- అక్షరాల తోవ నిర్వాహకులు, ఖమ్మం