Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీరుపై కవితలను ఆహ్వానం
తెలంగాణ సాహితి కాశ్మీరు సమస్యలపై కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నది. కాశ్మీరు సమస్యను సమగ్ర అధ్యయనం చేసి, నేటి పరిస్థితులపై స్పందిస్తూ రాసే కవితలను ఈ నెల 20 వ తేదీలోపు mk.ananthoju@gmail.com ఈ మెయిల్కు పంపాలని కోరుతున్నారు. ఈ కవితలన్నింటిని 'కవన కాశ్మీరం' పేరుతో సంకలనం తీసుకువస్తారు. వివరాలకు : 9948787660, 8897765417
- కె.ఆనందాచారి, తెలంగాణ సాహితి
నల్లమలకు సాహితీయాత్ర
తెలంగాణ సాహితి, ప్రజానాట్యమండలి సంయుక్తంగా ఈ నెల 10వ తేదీన నల్లమల సాహితీ పర్యటనను నిర్వహిస్తోంది. అక్కడి ప్రజల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు, గొంతులు కలిపే కవులు, రచయితలకు, కళాకారులకు ఆహ్వానం పలుకుతోంది. వివరాలకు : 9948787660, 8897765417.
- తెలంగాణ సాహితి, ప్రజానాట్యమండలి
'వెన్నెల పక్షులు' గ్రంథావిష్కరణ
డా||కేతవరపు రాజ్యశ్రీ రచించిన 'వెన్నెల పక్షులు' గ్రంథావిష్కరణ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో కె. శివారెడ్డి, డా||కె.వి.రమణాచారి, ఎం.కె.సుగమ్బాబు, సుధామ తదితరులు పాల్గొంటారు.
- రఘుశ్రీ, వ్యవస్థాపక కార్యదర్శి
11న సి.వి.కృష్ణారావు 'స్మృతిమననం' కార్యక్రమం
'తెలంగాణ చైతన్య సాహితి', 'నెలనెలావెన్నెల సాహితీ మిత్రులు', 'తెలంగాణ రచయితల సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో సి.వి.కృష్ణారావు గారి 'స్మృతిమననం' కార్యక్రమం 'నెలనెలా వెన్నెల పూలవాకిలి' ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ కవులు, అభిమానులు ఆత్మీయ సాహితీమిత్రులు పాల్గొంటారు.
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
నవలా స్రవంతి
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా 'నవలా స్రవంతి'లో భాగంగా ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలను రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో కవిరాజమూర్తి నవల 'మై గరీబ్ హు' పై తాటికొండాల నరసింహారావు ప్రసంగం వుంటుంది. ఈ సభకు డా||నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
-డా||ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి
'దాశరథి చలన చిత్ర గీతాలు - విమర్శనాత్మక పరిశీలన' ఆవిష్కరణ
ఆరవిల్లి జగన్నాథస్వామి రచించిన సిద్ధాంత గ్రంథం 'దాశరథి చలన చిత్ర గీతాలు - విమర్శనాత్మక పరిశీలన' ఆవిష్కరణ సభ ఈ నెల 14 న సాయంత్రం ఐదున్నర గంటలకు తెలుగు యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. కె. శ్రీనివాస్, జె. చెన్నయ్య, వక్కలంక వెంకట రమణ, వై. సత్యనారాయణ పాల్గొంటారు.
అన్నవరం దేవేందర్కు 'ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం'
ఈ సంవత్సరమే ప్రారంభించిన 'ఉదారి నాగదాసు స్మారక సాహితీ పురస్కారం'నకు అన్నవరం దేవేందర్ను ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 15వ తేదీ ఆదిలాబాద్లో జరిగే నాగదాసు స్మారక సాహిత్య సభలో నగదు, జ్ఞాపికతో పాటు ప్రదానం చేస్తారు. ఈ సభకు బి.నరసింగరావు, చెమన్ సింగ్ హాజరవుతారు.
- ఉదారి నారాయణ, 9441413666
'సుజ్ఞాన గీత' పుస్తకావిష్కరణ
డా||కూర్మాచలం శంకరస్వామి రచించిన 'సుజ్ఞానగీత' సామాజిక చైతన్య వ్యాసాల సంపుటి ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు జగద్గిరి గుట్ట మగ్దూం నగర్లోని నాగార్జున హై స్కూల్లో జరుగుతుంది. ఈ సభలో కందుకూరి శ్రీరాములు, బైస దేవదాస్, డా||అమ్మంగి వేణుగోపాల్, ప్రొ||వెల్దండ నిత్యానందరావు, డా||నాళేశ్వరం శంకరం, కాంచనపల్లి, పరమాత్మ, బెల్లంకొండ సంపత్కుమార్, తిరుక్కోవళ్ళూరి రామానుజం, అశ్వాపురం వేణుమాధవ్, బోయినపల్లి కిషన్రావు పాల్గొంటారు.
- తెలంగాణ రచయితల సంఘం
'రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం' కోసం కవితా సంపుటాల ఆహ్వానం
రంగినేని సుజాత మోహన్రావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్టు 'రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం' ఎంపిక కోసం 2017, 2018, 2019 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది. కవులు తమ కవితా సంపుటాల ఐదు ప్రతులను అక్టోబర్ 21 వ తేదీలోపు అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2019, రంగినేని సుజాత మోహన్రావు ఎడ్యుకేషనల్ డ చారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల - 505301, రాజన్న సిరిసిల్ల చిరునామాకు పంపాలి.
వివరాలకు : మద్దికుంట లక్ష్మణ్, 9441677373.