Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వృద్ధోపనిషత్' అనువాద గ్రంథాల ఆవిష్కరణ
డా|| ఎన్. గోపి రచించిన 'వృద్ధోపనిషత్' కావ్య హిందీ, ఇంగ్లీష్ అనువాద గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్.పి.రావు, వోలేటి పార్వతీశం, హర్షవర్ధన్, కిల్లాడ సత్యనారాయణ, మామిడి హరికృష్ణ, సిరిసిల్ల చందన పాల్గొంటారు.
- మద్దాళి రఘురాం, కార్యదర్శి
'ఏనుగు నరసింహా రెడ్డి సాహిత్యాంతరంగం' పుస్తక ఆవిష్కరణ
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రాసిన ఏనుగు నరసింహ రెడ్డి సాహిత్యాంతరంగం పుస్తక ఆవిష్కరణ సభ జనవరి 22 వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హల్లో జరుగుతుంది. కె. శివారెడ్డి, నాళేశ్వరం శంకరం, గురిజాల రామశేషయ్య, పి.సి. రాములు, ఎం. నారాయణ శర్మ, సి హెచ్ ఉషారాణి ప్రసంగిస్తారు.
గిడుగు పురస్కారాల ప్రదానోత్సవం
గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అందించే గిడుగు పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం మెయిన్ హాల్లో జరుగుతుంది. 'గిడుగు జీవన సాఫల్య పురస్కారాలు, గిడుగు సాహితీ పురస్కారాలు, గిడుగు కళాసేవా రంగాల పురస్కారాలు' పేరుతో కవులకు పురస్కారాలను అందజేస్తారు. ఇదే సభలో 'ముత్యాల గొడుగు - మన గిడుగు' కవితా సంకలనం ఆవిష్కరణ వుంటుంది. ఈ కార్యక్రమంలో డా||ప్రభాకర్ జైని, డా||సుద్దాల అశోక్తేజ, శంకర నారాయణ, బిక్కి కృష్ణ, గిడుగు సీతామహాలక్ష్మి, వడలి రాధాకృష్ణ, కళా జనార్థనమూర్తి, కస్తూరి అలివేణి, రాజావాసిరెడ్డి మల్లీశ్వరి తదితరులు పాల్గొంటారు.
జన్నాభటకల కథలు - 5 ఆవిష్కరణ
జన్నాభట్ల నరసింహ ప్రసాద్ రచించిన 'జన్నాభట్ల కథలు - 5' ఆవిష్కరణ ఈ నెల 22వ తేదీన త్యాగరాయ గానసభ, కళాసుబ్బారావు కళావేదికలో ఆవిష్కరిస్తారు. ఈ సభలో ఆచార్య ముదిగొండ శివప్రసాద్, పొత్తూరి సుబ్బారావు దంపతులు, గుదిబండి వెంకటరెడ్డి, విహారి, రమణ వెలమకన్ని, పెద్దూరి వెంకటదాసు పాల్గొంటారు.
'కాశ్మీర్ బహిరంగ చెరసాల' పుస్తకావిష్కరణ
'కాశ్మీర్ బహిరంగ చెరసాల' పుస్తకావిష్కరణ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరుగుతుంది. జహీర్ అలీఖాన్, గౌహర్ జిలాని, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాస్రెడ్డి, బి.రమాసుందరి, ఎన్.వేణుగోపాల్ పాల్గొంటారు.