Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేరో టైమ్స్ కథల పోటీ-2020
''చదువుతోనే వెలుగు'' థీమ్తో కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వేరో టైమ్స్ మాసపత్రిక ఎడిటర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కథలు చేతిరాతలో నాలుగు పేజీలు, టైప్ చేసి (సెల్ అయినా పర్వాలేదు) పంపే కథలైతే రెండు పీజీలకు మించకుండ రాయలని సూచించారు. కథలు జూలై 10, 2020 తేదీలోగా చేరాలని, ఎంపికైన కథల్లో ప్రథమ బహుమతికి రూ.ఐదువేలు, ద్వితీయ బహుమతికి రూ.మూడువేలు, తతీయ బహుమతికి రూ. రెండు వేలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలను స్వేరో టైమ్స్లో ప్రచురిస్తామని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా కథలు పంపేవారు నంబర్: 77026 48825కు పంపవచ్చు. మెయిల్ ఐడీ: drpasunuri@gmail.com
డా|| వేదగిరి రాంబాబు
కథానికా పురస్కారం - 2020
కథానిక కోసం జీవితాంతం పనిచేసిన డా|| వేదగిరి రాంబాబు సేవకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం వారి పేరు మీద నిర్వహించే కథానిక పురాస్కారాన్ని ఈ యేడాది కూడా నిర్వహిస్తున్నట్లు సింహ ప్రసాద్ సాహిత్య సమితి కన్వీనర్ సింహప్రసాద్ తెలిపారు. యువ రచయితలకు ఇచ్చే ఈ పురస్కారంలో పాల్గొనాలనుకునేవారికి వయసు అక్టోబర్ 14, 2020 నాటిక 40 యేండ్లు మించకుండా ఉన్న వారి నుంచి కథానికలు ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్కటి ఒక్కో కాపీ చొప్పున ఆగస్టు 14 లోపుగా అందేట్లు పంపాలి. అక్టోబర్ 14న హైదరాబాద్లో జరిగే రాంబాబు గారి జన్మదినోత్సవాన పురస్కారం అందజేస్తాం. ఎంపికైన వారికి నగదు బహుమతితో పాటు, జ్ఞాపిక, సత్కారం ఉంటాయి. ఏవైనా వివరాలకు9849061668 నంబర్లో సంప్రదించవచ్చు.