హైదరాబాద్ : ఏపీలో కరోనా విజృంభిస్తూనే వుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. కేసులతో పాటు ఏపీలో కరోనా మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం తిరుమలలో కూడా ఎక్కువగానే వుంది. తాజాగా కరోనాతో టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కన్నుమూశారు. కరోనాతో 4 రోజుల క్రితం టీటీడీ స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారని సమాచారం. ఈ విషయాన్ని టీటీడీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా.. ఈయన కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్పై తిరుమలకు వచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm