కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. పెంచికల్ పేట్ మండలం నెల్లూరు గ్రామానికి చెందిన లోసెగ్గెం రాజన్న (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంట్లోనే అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి భార్య, నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి డీఎస్పీ బీఎల్ ఎన్ స్వామి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm