హైదరాబాద్: జలమండలికి బిల్లులు సక్రమంగా చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. మంగళవారం ఆయన జలమండలి వన్ టైం సెటిల్మెంట్ పథకం కరపత్రాలు, బ్యానర్లు, గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 'జలమండలి బకాయిదారులకు సువర్ణావకాశం కల్పిస్తున్నాం. పెండింగ్లో ఉన్న నల్లా బిల్లుల వసూళ్ల కోసం వడ్డీని మాఫీ చేశాం. కేవలం బకాయి ఉన్న అసలు బిల్లు మాత్రమే చెల్లించండి. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది'అని కేటీఆర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm