హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా వేదికగా.. సోషల్ మీడియాలోనే సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరిన ఆయన.. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. ఇక, సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టే వారిని నిరంతరం గమనిస్తున్నామని.. అలాంటి వారిపై వెంటనే కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు, సీనియర్ అధికారులకు ఆదేశాలిచ్చామని పేర్కొన్న ఆయన.. ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యున్నతంగా నిలిపేలా సహకరించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా, కర్ణాటక ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేయడం బెంగుళూరులో తీవ్ర ఘర్షణలకు దారితీసింది. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందగా.. సాధారణ పౌరులతో పాటు 60 మందికి పైగా పోలీసులు గాయాలపాలయ్యారు. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని.. ఆ తర్వాతే పోస్టు పెట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 13,2020 07:50AM