హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్లోనే రికార్డయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే కోటి కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశం. కేసులు, మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉన్నది. ఆ దేశంలో 66,75,560 కేసులు నమోదుకాగా, 1,97,643 మంది మరణించారు. భారత్లో 52,14,677 కేసులు, 84,372 మరణాలు, బ్రెజిల్లో 44,55,386 కేసులు, 1,34,935 మరణాలు నమోదయ్యాయి.
ఇక ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 36 టీకాలు వివిధ క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. ఇందులో రెండు టీకాలను భారత కంపెనీలకు తయారు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరినాటికి విజయవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 19,2020 01:50PM