రంగారెడ్డి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్పల్లికి సమీపంలోని మూసీవాగు, తీగల వాగు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్పల్లి పట్టణంలోకి భారీగా చేరింది. పట్టణమంతా నదిని తలపిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కొందరి నివాసాల్లో బియ్యంతో పాటు ఇతర వస్తువులు తడిసి ముద్ద అయ్యాయి. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 19,2020 02:03PM