హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మరో పది అంబులెన్స్లను ప్రారంభించారు. కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ అంబులెన్స్లను అందజేశారు. సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అంబులెన్స్ను సమకూర్చారు. ఎంపీ రంజిత్రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రెండు అంబులెన్స్లను ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మహేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అంబులెన్స్లను అందజేశారు. గత నెల 8న కేటీర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో ప్రభుత్వానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంబులెన్స్లను అందజేశారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎంపీశ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి 9 అంబులెన్స్లను అందజేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm