హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ 13లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది ఫ్రాంచైజీ. ఆరెంజ్ ఆర్మీ క్యాంప్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు అఫ్ఘాన్ ద్వయం రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ. క్వారంటైన్ పూర్తి చేసుకుని వారిద్దరూ జట్టు ట్రైనింగ్లో జాయిన్ అయినట్టు సన్ రైజర్స్ ప్రకటించింది. మొహమ్మద్ నబీ ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంక్ సాధించారు. అటు వన్డేలు, ఇటు టీ 20లు రెండింట్లోనూ నెంబర్ వన్ ర్యాంక్ అతడి సొంతం. అలాంటి ఆల్ రౌండర్ క్వారంటైన్ ముగించుకుని జట్టు ట్రైనింగ్లో చేరడంతో ఆరెంజ్ ఆర్మీ కూడా ఆనందంగా ఉంది. నబీ పేరు చెప్పకుండా గత కొన్ని రోజుల నుంచి సన్ రైజర్స్ ఊరిస్తోంది. ఓ మేటి ఆల్ రౌండర్ రాబోతున్నట్టు ఫ్యాన్స్ను ఉత్కంఠలో నింపింది. మరో క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా క్వారంటైన్ ముగించుకుని జట్టు ట్రైనింగ్లో పాలుపంచుకున్నాడు. ఇద్దరూ చేరడంతో జట్టుకి మరింత బలం చేకూరనుంది. నేటి నుంచి యూఏఈ కేంద్రంగా ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 21న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో ఆడనుంది.
Mon Jan 19, 2015 06:51 pm