హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి మానవ అవయవాలను రికార్డు సమయంలో తరలించారు. హైదరాబాద్ సిటీ పోలీసులు, సైబరాబాద్ పోలీసుల సమన్వయంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటుతో ఇది సాధ్యమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండు కిడ్నీలు, ఒక లివర్తో మధ్యాహ్నం 1.23 గంటలకు బయల్దేరిన అంబులెన్స్ మొత్తం 36.8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకుంది. ఇందుకు సహకరించిన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులను కిమ్స్ ఆస్పత్రి మేనేజ్మెంట్ ప్రశంసించింది. ఈ ఏడాది నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఆర్గాన్స్ తరలింపునకు సహకరించారు. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ చర్య గొప్ప సంతృప్తిని ఇచ్చిందన్నారు. రికార్డు సమయంలో అవయవాలను చేరవేయడం గొప్ప విషయమన్నారు. ఇది కొంతమందికి అసౌకర్యాన్ని కలిగివచ్చు. అయినప్పటికీ ఇది ఓ మంచి కారణం కోసమని మీరంతా అంగీకరిస్తారన్నారు. ప్రజలకు, ట్రాఫిక్ పోలీసులు అభినందనలు అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm