దుబాయ్: ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు యూఏఈకి చేరుకున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. ఈ దేశాలకు చెందిన 21 మంది ఆటగాళ్ళు 6 రోజులకు బదులుగా కేవలం 36 గంటలు స్వీయ నిర్బంధంలో ఉండాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. క్వారంటైన్ సమయాన్ని తగ్గిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీలకు యూఏఈ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. లీగ్లో పాల్గొనేందుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చెందిన 21 మంది ఆటగాళ్ళు గురువారం సాయంత్రం యూకే నుంచి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా యూఏఈ చేరుకున్నారు. వారు కేవలం 36 గంటలు స్వీయ నిర్బంధంలో ఉండలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఈ ఆటగాళ్లందరూ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm