హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాల నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (హెచ్ఎమ్డబ్ల్యుఎస్ఎస్బి) మరింత ప్రవాహాన్ని ఆశిస్తోంది. హిమాయత్సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,747 అడుగులుగా ఉంది. అదేవిధంగా ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,761 అడుగులుగా ఉంది.
హైదరాబాద్కు తాగునీటి ప్రధాన వనరులు కృష్ణ నదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, గోదావరి నదిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు. రెండింటికి ఈ ఏడాది మంచి ప్రవాహాలు కొనసాగినందున నగరంలో తాగునీటి కొరత ఉండదని వాటర్ బోర్డు అధికారులు అన్నారు. హెచ్ఎమ్డబ్ల్యుఎస్ఎస్బి 2015 నుండి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటిని తోడటం మానేసింది. కాగా సింగూరు, మంజీరా జలాశయాలలో నీటి మట్టాలు తక్కువగా ఉన్న కారణంగా గత వేసవిలో ఈ జలాశయాల నుంచి నీటిని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 20,2020 08:58PM