హైదరాబాద్ : కర్ణాటక డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. దర్యాప్తును వేగవంతం చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, కేసుతో సంబంధం ఉన్న శ్రీనివాస్ సుబ్రమణియన్ అనే వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇతడి నుంచి 100 గ్రాముల గంజాయి, 13 ఎక్ట్సాసీ ట్యాబ్లెట్లు, 1.1 గ్రాముల ఎండీఎంఎ, 0.5 గ్రాముల హషీష్ సహ పలురకాల డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కస్డడీలో ఉన్న రవిశంకర్ ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్ ఇంట్లో సోదా నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన నటి రాగిణి ఇంటికి ఇతడు చాలాసార్లు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm