హైదరాబాద్ : ఇంట్లో... యాభై సంవత్సరాల క్రితం నాటి ఫోన్లు కానీ, కెమేరాలు కానీ, రేడియో కానీ, టీవీ కానీ, కుట్టు మిషన్లు కానీ ఉన్నాయా ? ఉంటే... మీ పంట పండినట్టే. ఎందుకంటే... వాటికి ఇప్పుడు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. ఇక వివరాలిలా ఉన్నాయి. ఆ పాత ఉపకరణాల కోసం... తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలను జల్లెడ పట్టేస్తున్నాయి కొన్ని ముఠాలు. లక్షలిచ్చి మరీ కొనడానికి సై అంటున్నాయి. ఎందుకంటే... 'రెడ్ మెర్క్యురీ' అనే విలువైన మూలకం వాటిల్లో ఉందన్న ప్రచారమే ఇందుకు కారణం. లునాటి రేడియో, టీవీలు తదితరాల్లో... రెడ్ మెర్క్యురీని ఉపయోగించేవారని, అణ్వాయుధాల తయారీలో దీని అవసరముంటుందని... గత అయిదారు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రెడ్ మెర్క్యురీ అనే పదం జనాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో... వీటిని ఈ-కామర్స్ ప్లాట్ఫాంలలో అమ్మకానికి పెడుతున్నారు కూడా. ఈ దందా... ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి మరి..!
Mon Jan 19, 2015 06:51 pm