ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. ఈ సందర్భంగా పొలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పూర్తికి నిధులను సత్వరం విడుదల చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా కృష్ణ నదికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించినట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను ఏపీకి సాధ్యమైనంత తొందరగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సెప్టెంబర్ 15న తెలిపారు. రాజ్యసభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో సీతారామన్ మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ర్ట ఆర్థికశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుకు ఆడిట్కు సంబంధించిన కాగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm