ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కేసులు, మరణాల పరంగా దేశంలో తొలిస్థానంలో ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,029 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 479 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 12,63,799కు మరణాల సంఖ్య 33,886కు చేరింది. గత 24 గంటల్లో 19,476 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 9,56,030 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 2,73,477 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm