హైదరాబాద్: కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కందాడి ధర్మారెడ్డిని అరెస్ట్ చేశారు. కీసర ఎమ్మార్వో నాగరాజుతో కలిసి భూ సెటిల్మెంట్లు, పట్టా పాస్బుక్లు ధర్మారెడ్డి చేయించినట్లు అధికారులు గుర్తించారు. 2011లో కుషాయిగూడ పీఎస్లో ధర్మారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ధర్మారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm