హైదరాబాద్: ఈనెల 28 నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తారు. ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ తర్వాత ఏపీ, తెలంగాణ సర్వీసులపై నిర్ణయం తీసుకుంటారు. ముంబై, పుణె, గుల్బర్గా, నాందేడ్, బీదర్ మార్గాల్లో తొలుత సర్వీసులు ప్రారంభిస్తారు. కర్ణాటకలో బెంగళూరు మినహా మిగతా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో పరిమిత సంఖ్యలో పరుగులు పెట్టాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్డౌన్తో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో కొవిడ్ ఉ 19 నిబంధనలను పాటిస్తూ 25 శాతం బస్సులను శుక్రవారం ప్రారంభించారు. కండక్టర్, డ్రైవర్లకు వ్యక్తిగతగా ఒక్కొక్కటి చొప్పున శానిటైజర్ బాటిల్స్ ఇచ్చారు. కండక్టర్ ప్రయాణికుల చేతులపై శానిటైజర్ స్ర్పే కొడుతున్నారు. మాస్కు ఉంటేనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm