న్యూఢిల్లీ: డీజిల్ ధరలు వరుసగా మూడోరోజూ స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ డీజిల్పై 13-14 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.70.94 నుంచి రూ.70.80కు తగ్గింది. అయితే డీజిల్ ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.06గా ఉన్నది. దేశంలోని మెట్రోనగరాలైన ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.77.22, పెట్రోల్ ధర రూ.87.74, చెన్నైలో డీజిల్ ధర రూ.76.27, పెట్రోల్ ధర రూ.84.14, కోల్కతాలో డీజిల్ ధర రూ.74.32, పెట్రోల్ ధర రూ.82.59గా ఉన్నది. కాగా పెట్రో ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కవిధంగా ఉండటంతో డీజిల్, పెట్రోల్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm