షార్జా: ఐపీఎల్-2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్మెన్ అదరగొడుతున్నారు. ఓపెనర్ మయాంగ్ అగర్వాల్(106: 50 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) అద్భుత శతకంతో మెరువగా కెప్టెన్ కేఎల్ రాహుల్(69:54 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో పంజాబ్ రెండు వికెట్లకు 223 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఓపెనర్లు రికార్డు 183 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్ చెరో వికెట్ పడగొట్టారు. ఓపెనర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm