విశాఖపట్నం: గుర్రం జాషువా జయంతి వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ను పలువురు దళిత నేతలు నిలదీశారు. నగరంలోని ఉడా చిల్డ్రన్ ఏరినాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దళితుల సమస్యల కోసం పోరాడుతున్న వారిని స్టేజి మీదకు ఆహ్వానించలేదని ఇదే నా దళితులకు ఇచ్చే గౌరవం అంటూ మంత్రి అవంతి ఎదుట ఎస్సీసెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో వారికి నచ్చజెప్పిన మంత్రి ఆపై దళిత నేతలను స్టేజి మీదకు ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm