హైదరాబాద్ : హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు.. 155 గ్రాముల నిషేధిత హషీస్ ఆయిల్ను కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు తెలిపారు. క్రమం తప్పకుండా గంజాయితో పాటు హషీస్ ఆయిల్ను సేవిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా హషీస్ ఆయిల్ను బోయిన్పల్లి, మల్కాజ్గిరి ఏరియాల్లో తమకు తెలిసిన వ్యక్తులకు విక్రయిస్తున్నారు. సాయి రెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ ఐదుగురు హషీస్ ఆయిల్ను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. వీరిద్దరూ పరారీలో ఉన్నారు. అయితే అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి 5 గ్రాముల హషీస్ ఆయిల్ను రూ. 1500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm