హైదరాబాద్ : తన వినియోగదారులు పెట్టుబడులు పెట్టడం కోసం 7 కొత్త మ్యూచువల్ ఫండ్ కేటగిరీలను ప్రారంభిస్తున్నట్లు భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe వెల్లడించింది. ఇప్పటికే 2020 మే నెలలో సూపర్ ఫండ్స్ను, 2020 జనవరిలో లిక్విడ్ ఫండ్స్ను ఆవిష్కరించిన PhonePe ఇప్పుడు తన 23 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు ఒక గొప్ప, విస్తృతమైన పెట్టుబడి మార్గాలను అందిస్తోంది. ఈ వినియోగదారులు, నిపుణులు నిర్వహించే సూపర్ ఫండ్స్ సొల్యూషన్ ను ఎంచుకోవడమో లేదా 9 కేటగిరీల్లో ఆసక్తి కలిగిన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం ద్వారా సొంత పోర్ట్ఫోలియోను నిర్మించుకోవడమో చేయవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, డైవర్సిఫైడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, హైబ్రిడ్ - అగ్రెసివ్ డ డైనమిక్ అసెట్ కేటాయింపు, డెట్, లిక్విడ్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కేటగరీలు PhonePe లో అందుబాటులో ఉన్నాయి.
కొత్త కేటగిరీల ప్రారంభంతో, ఇన్వెస్టర్లు తమ జీవిత లక్ష్యాలకు, పెట్టుబడి పెట్టాలనుకునే తీరుకు అనుగుణంగా తమ సొంత ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్మించుకోవాలన్నది PhonePe లక్ష్యం. తద్వారా ఇన్వెస్టర్లకు తమ పోర్ట్ఫోలియోపై మరింత ఎక్కువ పట్టు లభిస్తుందని, మరింత సులభంగా వ్యవహరించడానికి సాధ్యమవుతుందని PhonePe వివరిస్తోంది. వినియోగదారులు అత్యంత సులువుగా, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని PhonePe సర్వదా కోరుకుంటుంది. ఇందుకు తగ్గట్లుగా సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా మ్యూచువల్ ఫండ్లపై వినియోగదారులకు అవగాహన కల్పించడానికి PhonePe అవసరమైన ఏర్పాట్లు చేసింది. పెట్టుబడి పెట్టే ప్రయాణంలో ప్రతి చోటా ఎడ్యుకేషనల్ టిప్స్ అందిస్తోంది. PhonePe యాప్లోని ఇన్వెస్టింగ్ విభాగం ప్రతి మ్యూచువల్ ఫండ్పై విస్తృతమైన సమాచారాన్ని అందిస్తోంది. అందరు ఇన్వెస్టర్లు, చక్కటి అవగాహనతో నిర్ణయం తీసుకునే విధంగా PhonePe ఈ రీసోర్సులను తీర్చిదిద్దింది. తొలిసారి పెట్టుబడి పెడుతోన్న కొత్త ఇన్వెస్టర్లతో పాటు ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి అవగాహన తెచ్చుకుని తమ వీలును బట్టి అన్ని పెట్టుబడులను సులభంగా మేనేజ్ చేయాలనుకునే వారికి కూడా ఉపయోగపడే విధంగా రీసోర్సులను రూపొందించింది.
కొత్త కేటగిరీలను ప్రారంభించిన సందర్భంగా PhonePe లోని మ్యూచువల్ ఫండ్స్ డ గోల్డ్ విభాగం అధిపతి టెరెన్స్ లూసీన్ మాట్లాడుతూ.. మా వినియోగదారులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి నిర్దిష్టమైన ఉత్పత్తులను అందించాలని PhonePeతో మేము ఎప్పుడూ భావిస్తాము. సమగ్రమైన పెట్టుబడి మార్గాలు కావాలనుకునే వినియోగదారుల కోసం మేము మే నెలలో సూపర్ ఫండ్లను ప్రారంభించాము. ఈ ఫండ్స్ను సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులు నిర్వహిస్తారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన 7 ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్ కేటగిరీలు, మరింత లోతైన నియంత్రణ కావాలని, సొంతంగా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్మించుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల అవసరాలను తీరుస్తాయి. భారతీయులందరూ తమ డబ్బును వృద్ధి చేసుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం కల్పిస్తూ వారు తమ కలలు నెరవేర్చుకోవడానికి మేము తాజాగా అందిస్తోన్న ఈ పెట్టుబడి మార్గాలు తోడ్పాటును అందిస్తాయని మేము బలంగా విశ్వసిస్తున్నాముఅని అన్నారు.
PhonePe గురించి:
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePeలో 23 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు ఉన్నారు. PhonePe ద్వారా వినియోగదారులు డబ్బు పంపవచ్చు, స్వీకరించవచ్చు. మొబైల్, DTH, డేటా కార్డులను రీఛార్జ్ చేసుకోవచ్చు. దుకాణాల్లో డబ్బులు చెల్లించవచ్చు. కరెంట్ బిల్లులు లాంటివి కట్టవచ్చు. బంగారం కొనుగోలు చేయవచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. 2017లో డిజిటల్ గోల్డ్ను ప్రారంభించడం ద్వారా PhonePe ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో అడుగుపెట్టింది. డిజిటల్ గోల్డ్ ద్వారా వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని సురక్షితంగా తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశాన్ని PhonePe తన వేదికలో అందిస్తోంది. ఆ తరువాత నుంచి PhonePe , మ్యూచువల్ ఫండ్స్ను, ఇన్సూరెన్స్ ప్రోడక్టులను ప్రారంభించింది. ఇందులో ట్యాక్స్-సేవింగ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, COVID-19 మహమ్మారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన కరోనా కేర్ లాంటి బీమా ఉత్పత్తులు ఉన్నాయి. 2018లో PhonePe తన స్విచ్ వేదికను కూడా ప్రారంభించింది. ఈరోజున PhonePe మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా Ola, Myntra, IRCTC, Goibibo, RedBus, Oyo లాంటి 200లకు పైగా యాప్స్లో ఆర్డర్లు చేయవచ్చు. జాతీయ స్థాయిలో 500 నగరాల్లో ఒక కోటి 20 లక్షల మందికి పైగా వ్యాపార దుకాణాల్లో PhonePe ద్వారా పేమెంట్లను అంగీకరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 05:25PM