హైదరాబాద్: ఇటీవల ఏపీ తెలంగాణ మధ్య జల జగడాలు ముదురుతున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలతో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. సీఎం జగన్ను పిలిచి భోజనం పెట్టి మాట్లాడితే.. నదీ జలలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటోందని సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం మండిపడ్డారు. తమ కేటాయింపుల్లో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని ఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణే ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల జల వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాల మధ్య వచ్చే నెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాన సీఎం కేసీఆర్ ఈ భేటీకి హాజరవుతారు. ఐతే ఇప్పటికి రెండుసార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. మొదటిసారి ఆగస్టు 5వ తేదీన సమావేశం జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మరోమారు అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబరు6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో త్రవ్రంగా ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశాము. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరాము. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షణ్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేశైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా అయినా తెలంగాణాకి నీటి కేటాయింపులు జరపాలని కోరాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాము. ఏడేళ్ల సమయం వచ్చినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈ నాటికి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి ఉలుకు లేదు పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నీ కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ఆయన కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 30,2020 12:04PM