కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో శ్రీ పంచముఖ హనుమాన్ గుడిలో దుండగులు చోరీకి తెగబడ్డారు. హుండీ పగులగొట్టి అందులో సుమారు రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు జిల్లాలోని తుమ్మనపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm