భోపాల్: రెండు రోజుల పసిబిడ్డను కిరాతకంగా పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బిడ్డను పలుమార్లు పొడిచి, శాలువాలో చుట్టి దుండగులు భోపాల్లోని అయోధ్య నగర్ ప్రాంతంలో ఓ దేవాలయం ఆవరణలో సోమవారం పడేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం బుధవారం పోలీసులు ఈ వివరాలు వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసి, సమీప ఆస్పత్రుల్లో గత వారం రోజుల్లో జరిగిన కాన్పుల వివరాలు సేకరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm