చిత్తూరు : జిల్లాలోని తంబళ్లపల్లె మండలంలో కురవపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇట్నేనివారిపల్లె సమీపంలో నీటి కుంటలో పడి భార్యాభర్తలు మృతి చెందారు. మరణించిన వారిని నారాయణ (68) వెంకట రమణమ్మ (62) దంపతులుగా స్థానికులు గుర్తించారు. ఇట్నేనివారిపల్లె సమీపంలోని వారి పొలంలో వేరుశనగ పంటకు దంపతులు కాపలా ఉన్నారు. అయితే ఇవాళ గుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లిన భార్య కాలు జారి నీటి గుంటలో పడింది. ఆమెను రక్షించడానికి వెళ్లిన భర్త వెళ్లగా దంపతులిద్దరూ మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. దంపతుల మరణంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో కురవపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm