హైదరాబాద్ : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. పుణెలో వర్షాల ధాటికి రోడ్లపైకి భారీగా నీరు చేరుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో వరదలు పోటెత్తాయి. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పుణె, ఔరంగబాద్, కొంకణ్ డివిజన్లలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
Mon Jan 19, 2015 06:51 pm