హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జంట నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది 3000 అదనపు బస్సులు నడుపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం వరప్రసాద్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm