హైదరాబాద్ : జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేడు బెంగళూరు అమృతహళ్లిలో తన 500 శాఖను ప్రారంభించి, సరికొత్త మైలు రాయిని నెలకొల్పింది. ఈ బ్యాంకు తన మిగిలిన అసెట్ సెంటర్లను బ్యాంకు శాఖలుగా పరివర్తించనుంది మరియు మార్చి 2021 నాటికి తన శాఖలను 600 పైచిలుకుకు పెంచుకోనుంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలు, ఆకర్షణీయమైన వడ్డీ ధరలతో ఫిక్స్డ్ డిపాజిట్లు, తాకట్టు రహిత రుణాలు మరియు అందుబాటు ధరలో గృహ రుణ పథకాల ద్వారా తక్కువగా బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్న వినియోగదారులకూ సేవలను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 40 లక్షల పైచిలుకు వినియోగదారులకు, 15,000+ ఉద్యోగులతో తన 500 బ్యాంకు శాఖలు మరియు 100+ అసెట్ సెంటర్లు/ఔట్లెట్ల ద్వారా సేవలు అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ ‘‘కోవిడ్ కష్ట కాలంలోనూ మా బ్యాంకర్లు నూతన బ్యాంకు శాఖలను తెరిచేందుకు మాకు అవకాశాన్ని కల్పించారు. అన్ని నూతన శాఖలు డిజిటైజ్డ్ పరిసరాల్లో ఉన్నాయి మరియు తక్కువ సదుపాయాలు కలిగిన వారికి మా ఉత్పత్తులు సేవలు అందిస్తాయని’’ తెలిపారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్బిఐ కర్ణాటక, ప్రాంతీయ డైరెక్టరు, జోస్ జె.కట్టూర్ మాట్లాడుతూ ‘‘జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 500వ శాఖను ప్రారంభించినందుకు నా అభినందనలు. బ్యాంకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు ఉత్తేజాన్ని అందిస్తుండగా, ఇది కోవిడ్ అనంతరం పరిసరాల్లో అత్యంత సూక్తమని చెప్పవచ్చు. బ్యాంకు యువతను బ్యాంకింగ్ వృత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వడం మరియు భారతదేశంలో మారు మూల ప్రాంతాల యువతకు ఉద్యోగాలను అందించడం చాలా సంతోషంగా ఉందని’’ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 21,2020 05:22PM