హైదరాబాద్: గతవారం రోజులుగా వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది రాగల 24గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీంతో రాగల 24గంటల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం రాగల 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరంపై వైపునకు వెళ్లే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంత ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలలో మోస్తరు నుంచి విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 21,2020 05:49PM