హైదరాబాద్ : అఫ్ఘనిస్తాన్లో జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో పన్నెండు మంది మహిళలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పాకిస్తాన్ వీసాల కోసం ఎంబసీకి చేరుకునేందుకు దగ్గరలోని ఓ స్టేడియంలో పెద్ద ఎత్తున గుమిగూడినపుడు తొక్కిసలాట చోటుచేసుకుంది. పాకి్స్తాన్ కొత్త వీసా విధానాన్ని ప్రకటించిన నుంచి ఆ దేశపు వీసాల కోసం వేలాది సంఖ్యలో అఫ్ఘన్ జనం ఎగబడుతున్న విషయం తెలిసిందే. అఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ నగరంలో వున్న పాకిస్తాన్ ఎంబసీ దగ్గర భారీ సంఖ్యలో జనం పాక్ వీసాల కోసం క్యూ కట్టారు. వీరిని క్రమపద్దతిలో తీసుకువెళ్ళేందుకు ఎంబసీకి దగ్గరలోని ఓ స్టేడియంలో వారిని క్యూలో వుంచారు. క్యూ కాస్తా గతి తప్పడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి అత్తౌల్లా ఖోగ్యానీ వెల్లడించిన వివరాల ప్రకారం వీరంతా పాకిస్తాన్ వీసాల కోసం అప్లై చేసుకునేందుకు ఎంబసీకి వచ్చారు.
అయితే వారందరినీ నేరుగా పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళనీయకుండా.. దగ్గరలోని స్టేడియంలో ఆర్గనైజ్ చేసి, క్రమ పద్దతిలో ఎంబసీకి పంపేందుకు ప్రావిన్స్ అధికారులు ప్రయత్నించారు. కానీ జనం పెద్ద ఎత్తున ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా పన్నెండు మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ దేశపు కొత్త వీసా విధానం ప్రకారం పెద్ద ఎత్తున అఫ్ఘనిస్తాన్ పౌరులకు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం కలుగుతోంది. దాంతో ప్రతీ రోజు వేలాది మంది పాక్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరికొందరైతే రాత్రిళ్ళు అక్కడే గడిపి పొద్దున్నే ఎంబసీ ముందు క్యూ కడుతున్నారు. దుర్ఘటనపై రెండు దేశాల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 21,2020 06:11PM