హైదరాబాద్: కరోనా నేపథ్యంలో చాలా వరకు విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల జరుగుతున్నాయి. దీంతో ఇంట్లోనే ఉండి టీచర్లు చెప్పే పాఠాలు వింటున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులపై సరిగా శ్రద్ధ వహించడం లేదని ఓ 12 ఏళ్ల బాలికపై ఆమె తల్లి దాడి చేసింది. పెన్సిల్తో బాలికను పొడించింది. ఈ ఘటన ముంబైలోని శాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. 6వ తరగతి చదువుతున్న బాలిక ఆన్లైన్ ద్వారా క్లాసులు వింటుంది. అయితే టీచర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పలేకపోయింది. ఇది చూసిన బాలిక తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. వెంటనే అక్కడే ఉన్న పెన్సిల్తో బాలికపై దాడికి దిగింది. బాలిక వెనక భాగంలో పెన్సిల్తో పొడిచింది. అనంతరం ఆ బాలికను పలుమార్లు కోరికింది. అయితే ఇదంతా చూసిన ఆ బాలిక చెల్లలు భయపడిపోయింది. తల్లి అలా ప్రవర్తిస్తూంటే ఏం చేయాలో ఆ చిన్నారికి తోచలేదు. అక్క ఏడుపు చూసి తట్టుకోలేని ఆ చిన్నారి చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ 1098కి ఫోన్ చేసింది. అక్కడ జరిగిన విషయం చెప్పింది. దీంతో ఎన్జీవో నుంచి ఇద్దరు ప్రతినిధులు ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. ఈ విషయంపై బాలిక తల్లితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. చాలా మొండిగా వ్యవహరించింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికి బాలిక తల్లిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm