హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బీహార్ ప్రజల మద్దతు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ నటుడు శత్రుఘన్ సిన్హా అన్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ బీహార్ ర్యాలీలను ఉద్దేశించి శత్రుఘన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. మోడీ పర్యటన చాలా పేలవంగా ఉందని, ఆయనకు ప్రజల మద్దతు లేదని అన్నారు. బీహార్లో పేదరికం, నిరుద్యోగం, తలసరి ఆదాయం గురించి మోడీ తన ర్యాలీల్లో ఎక్కాడా ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో కాలినడకన వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ వలస కార్మికులకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని ప్రభుత్వం చెబుతోందని సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాఘట్బంధన్ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్పై సిన్హా ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం బలంగా ఉందన్నారు. కాగా, పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై సిన్హా కుమారుడు లవ్ సిన్హా బరిలోకి దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm