ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించగా, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో బెంగళూరు ఇన్నింగ్స్ 145 పరుగుల వద్ద ముగిసింది. అరోన్ ఫించ్ 15 పరుగులు చేయగా, మొయీన్ అలీ 1, క్రిస్ మోరిస్ 2, గురుకీరత్ సింగ్ 2, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్ 2, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ పడగొట్టాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 25,2020 05:28PM