మహబూబ్ నగర్: దసరా పండుగ ఈ గ్రామంలో ఒకే పార్టీకి సంబంధించిన వారు రెండు గ్రూపులుగా ఏర్పడి రెండు జమ్మిచెట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా మహిళా సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి ఓ వ్యక్తి గాయపరచగా ఆమె న్యాయం కోసం కేశంపేట పోలీసులను ఆశ్రయించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేశంపేట గ్రామంలో మొదట అందరూ కలసి వేపచెట్టుకు పూజచేశారు. అనంతరం సామాజిక దూరాన్ని పాటిస్తూ జమ్మిచెట్టు దగ్గరకు బయలుదేరారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డితో పాటు మరికొంత మంది కార్యకర్తలు వారికి అడ్డుకొని వారు ఏర్పాటుచేసిన జమ్మిచెట్టు రావాలని కోరారు. అదేంటి జమ్మిచెట్టు ఊరు బయట పెట్టామని చెప్పాంగా మళ్ళీ ఇదేంటని సర్పంచ్ వర్గం ప్రశ్నించింది. అనంతరం సర్పంచ్ ఏర్పాటు చేసిన చెట్టు వద్దకు అందరూ వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మరికొంత మంది మరోచోట జమ్మిచెట్టు పెట్టి పూజలు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు ఆ గ్రామంలో బహిరంగమయ్యాయి.
జమ్మిచెట్టుకు పూజచేసి ఇంటికి చేరుకున్న మహిళ సర్పంచ్ రేణుక వద్దకు గ్రామానికి చెందిన వ్యక్తి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమెపై దాడి చేశాడు. దీంతో సర్పంచ్ చేతులకు గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దసరా పండుగ రోజు ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఈ గొడవ రాజేసిన వ్యక్తులపై అటు పోలీసులు, ఇటు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 26,2020 09:25AM